Ayyappa Idol Eyes Open: అభిషేకం జరుగుతుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!

Ayyappa Idol Eyes Open: కోయంబత్తూరులోని మణికంఠస్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఇటీవలే జరిగిన 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో అభిషేకం జరుగుతున్న సమయంలో అయ్యప్ప స్వామి విగ్రహం కళ్లు తెరిచిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 06:34 PM IST
Ayyappa Idol Eyes Open: అభిషేకం జరుగుతుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!

Ayyappa Idol Eyes Open: తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ వింత ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న మణికంఠ స్వామి ఆలయంలో ఇటీవలే 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3 వేలకు మందికిపైగా అయ్యప్ప స్వామి భక్తులు హాజరయ్యారు. 

ఈ సమయంలో పూజారులు అయ్యప్ప విగ్రహానికి అభిషేకం చేస్తుండగా.. విగ్రహం కళ్లు తెరిచినట్లు ఆలయ పూజారులు, భక్తులు గుర్తించారు. ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగుసార్లు విగ్రహం కళ్లు మూస్తూ తెరుస్తూ ఉందని భక్తులు తెలిపారు. 

ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయ్యప్ప స్వామి కళ్లు తెరిచాడన్న విషయాన్ని తెలుసుకున్న చుట్టు పక్కల ఊర్ల ప్రజలు.. దేవుడ్ని దర్శించుకునేందుకు తండోపతండాలు వస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం అయ్యప్ప స్వామికి కళ్లు తెరచిన వీడియోలో ఏముందో మీరూ చూసేయండి.  

Also Read:Ratan Tata : మరోసారి సింప్లిసిటీ చాటుకున్న రతన్ టాటా.. వైరల్ అవుతోన్న వీడియో!

Also Read: Petrol Pump Frauds: దేశంలోని అనేక పెట్రోల్ స్టేషన్లలో చీటింగ్.. ఆ మోసాలను పసిగట్టండిలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News