Hyderabad: దారుణం: భర్తకు మద్యం తాగించి.. భార్యపై హత్యాచారం..

 Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌లో దారుణం జరిగింది. వివాహితపై  ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 07:07 PM IST
  • హైదరాబాద్ లో దారుణం
  • వివాహితపై హత్యాచారం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Hyderabad: దారుణం: భర్తకు మద్యం తాగించి.. భార్యపై హత్యాచారం..

Hyderabad Crime news: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై  ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య (Rape And Murder)కు పాల్పడ్డారు. 

వివరాల్లోకి వెళితే..
అబ్దుల్లాపూర్​మెట్(Abdullapur Met)​లోని ఓ వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలో అతని భార్య(Wifez0పై ఆ ఇద్దరు వ్యక్తులు కన్నేశారు. ఎలాగైనా అతన్ని స్పృహ కోల్పోయేలా చేయాలని ఎక్కువగా మద్యం తాగించారు. అనంతరం ఇద్దరు కలిసి వివాహితపై అత్యాచారం(Rape) చేశారు. ఆమె ప్రతిఘటించటంతో...మరింత రెచ్చిపోయి ఆమెను హత్య(Murder) చేశారు. 

Also Read: Prostitution busted: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార దందా... బట్టబయలు చేసిన పోలీసులు

మత్తు నుంచి తేరుకున్న భర్త విగతజీవిగా పడి ఉన్న భార్యను చూశాడు. ఏమి జరిగి ఉంటుందని ఓ అంచనాకు వచ్చాడు. వెంటనే పోలీసుల(Police)కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్ స్వాడ్​తో విచారణ చేపట్టారు. నిందితుడు సురేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News