Kurnool: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొన్ని ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

Last Updated : Dec 15, 2020, 10:15 AM IST
  • ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
  • లారీ ఢీకొనడంతో నలుగురి మృతి
  • డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు
Kurnool: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొన్ని ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కర్నూలు - చిత్తూరు జాతీయ రహాదారిపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల వద్ద 40 మంది రోడ్డు దాటుతుండగా ఐషర్‌ లారీ వారిని ఢీకొంది. 

Also Read: AP: వైఎస్ జగన్ చేతుల మీదుగా భారీగా ఇళ్ల స్థలాల పంపిణీ.. ముహూర్తం ఖరారు

రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందారు. మరో 8 మంది గాయపడగా, చికిత్స నిమిత్తం సమీపంలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను సురేఖ, ఝాన్సీ, వంశీ, హర్షవర్దన్‌‌లుగా గుర్తించారు. అయితే వీరిని ఢీకొన్న అనంతరం కనీసం వాహనాన్ని ఆపకుండా లారీ డ్రైవర్ పారిపోయే యత్నం చేశాడు. దీంతో స్థానికులు వెంబడించి ఆళ్లగడ్డ సమీపంలోని బత్తులూరు వద్ద లారీ డ్రైవర్‌ను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే 

 

Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News