PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. 19వ విడుత రూ.2,000 ఆరోజే ఖాతాల్లో జమా..!

PM Kisan 19 th  Installment: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధుల విడుదల పై బిగ్ అప్డేట్‌. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారి ఖాతాల్లో త్వరలో రూ.2,000 జమా చేయనున్నట్లు ఓ అప్డేట్‌ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్‌ యెజనలో భాగంగా ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమా చేస్తుంది.
 

1 /6

ఈ నెల అక్టోబర్‌ 5వ తేదీన పీఎం కిసాన్‌ 18వ విడుత నిధులను పీఎం నరేంద్ర మోదీ సర్కార్‌ విడుదల చేసిన సంగతి తెలిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు.  

2 /6

పీఎం కిసాన్‌ పథకంలో మీ పేరు లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. pm kisan.gov.in ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌, ఆధార్‌కార్డు తప్పనిసరి. లబ్దిదారులు స్టేటస్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.  

3 /6

రైతలకు అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్‌లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఒకవేళ వారి ఖాతాల్లో డబ్బులు జమా కాకపోతే వెంటనే కాల్‌ చేయవచ్చు.   

4 /6

ప్రతిఏడాది రైతులకు రూ.6000 ఖాతాల్లో జమా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రధాన లక్ష్యం చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడం. ఏడాదికి మూడు సార్లు ఈ నిధులను విడుదల చేస్తుంది.   

5 /6

రూ.2000 ఒక్కో విడతలో రైతుల ఖాతాల్లో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్) ద్వారా జమా చేస్తుంది. మొన్న 18వ విడత డబ్బులను విడుదల చేసిన పభుత్వం,19వ విడతను కూడా అతి త్వరలో విడుదల చేయనుందట.  

6 /6

2025 ఫిబ్రవరి నెలలోనే పీఎం కిసాన్‌ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందట.