Triptii Dimri: యానిమల్ తర్వాత బ్యాడ్ న్యూస్ తో మళ్లీ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా తృప్తి డిమ్రి..

Triptii Dimri: తృప్తి దిమ్రి .. నటిగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 7 యేళ్లు అవుతున్న.. గతేడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా పాపులార్ అయింది. ఈ సినిమాలో ఈ అమ్మడి స్కిన్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగింది. తాజాగా బ్యాడ్ న్యూస్ మూవీతో మరోసారి వార్తల్లో నిలిచింది.

1 /7

తృప్తి డిమ్రి.. 2017లో శ్రీదేవి టైటిల్ రూల్ పోషించిన ‘మామ్’ మూవీలో చిన్న పాత్రలో మెరిచింది.  అదే యేడాది సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ మూవీస్ తో కథానాయికగా పరిచయమైంది.

2 /7

ఇక 2018లో రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 2020లో వచ్చిన బుల్ బుల్, ఖాలా సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.

3 /7

అటు 2021లో  ఫోర్బ్స్  అండర్ 30 లిస్టులో పేరు సంపాదింకుంది. ఈమె 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ లో జన్మించింది.

4 /7

తృప్తి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. అంతేకాదు ఇంగ్లీష్ హానర్స్ తో ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదవు పూర్తైయిన తర్వాత పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్  లో నటనలో శిక్షణ తీసుకుంది.

5 /7

లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీలో రణబీర్ కపూర్ తో ఈమె చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. 

6 /7

తాజాగా విక్కీ కౌశల్ ముఖ్యపాత్రలో నటించిన ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలో కూడా హాట్ హాట్ గా నటించిన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు త్వరలో ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తుంది.

7 /7

మొత్తంగా యానిమల్ మూవీతో వచ్చిన పాపులారిటీతో తాజాగా బ్యాడ్ న్యూస్ సినిమాకు బాగానే కలిసొచ్చింది. మొత్తంగా తృప్తి దిమ్రీ ఇపుడు  కుర్రాళ్లకకు కలల రానిగా మారిందనే చెప్పాలి.