యంగ్ క్రికెటర్ పృథ్వీ షా ఖాతాలో వరల్డ్ రికార్డు

                 

Last Updated : Oct 4, 2018, 04:09 PM IST
యంగ్ క్రికెటర్ పృథ్వీ షా ఖాతాలో వరల్డ్ రికార్డు

 సౌరాష్ట్ర: విండీస్ తో జరగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో అదరగొడుతున్న యంగ్ ఓపెనర్ పృథ్వీ షా.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.  ఆరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. తద్వారా 59 ఏళ్ల రికార్డును షా బద్దలు కొట్టినట్లయింది...గతంలో అంటే 1959లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన అబ్బాస్ అలీ తక్కవ వయసులో హాఫ్ చేసిన రికార్డును..మన యంగ్ క్రికెటర్ పృథ్వీ ఇప్పుడు తిరగ రాశాడు.

సచిన్ సరసన పృథ్వీ

అంతేకాదు ప్రపంచంలోనే ఓపెనర్‌గా తక్కువ వయసులో యాభై పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగానూ షా నిలిచాడు. భారత జట్టు తరపున అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.  అతడి కంటే ముందు సచిన్, పార్థీవ్ పటేల్ ఈ ఘనత సాధించారు

Trending News