పొరపాటున తిట్టేసిన కేంద్రమంత్రి

Last Updated : Nov 12, 2017, 09:14 AM IST
పొరపాటున తిట్టేసిన కేంద్రమంత్రి

కేంద్రమంత్రి సదానంద గౌడ ఎదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడేశారు. ఆ తరువాత జరిగిన పొరపాటును గుర్తించి నాలుక్కర్చుకున్నారు. అంతగా ఏముందనేగా మీ డౌట్??

కర్ణాటకలో బీజేపీ పరివర్తన యాత్రలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దక్షిణ కర్ణాటకలో బంట్వాళలో బీజీపీ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి సదానంద గౌడ వచ్చారు. మైక్ తీసుకున్న ఆయన.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ తడబడ్డారు. సొంత పార్టీపైనే విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విమర్శించే జోరులో ప్రధానిపై తొందరలో నోరుజారారు.  "కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మోదీకి  సిగ్గుండాలి" అని పొరపాటున వ్యాఖ్యానించారు. సహచరుల సూచనల మేరకు పొరపాటును సరిచేసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, పలువురు పార్టీ ప్రముఖులు ఉన్నారు.

Trending News