ప్రొజెక్టర్ల హడావుడి: మేఘాలయ ఎన్నికల్లో సరికొత్త ట్రెండ్

Last Updated : Mar 3, 2018, 10:51 AM IST
ప్రొజెక్టర్ల హడావుడి: మేఘాలయ ఎన్నికల్లో సరికొత్త ట్రెండ్

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ప్రొజెక్టర్ల హడావుడి ప్రారంభమైంది. జనాలు ఎన్నికల ఫలితాలను వీక్షించడానికి ప్రొజెక్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.  త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.  ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రజలు.. పోలో గ్రౌండ్‌కు ఇప్పటికే వేలాది సంఖ్యలో తరలివచ్చారు.ఈసారి ఇక్కడ బీజేపీ (భారతీయ జనతా పార్టీ) పాగా వేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మేఘాలయలో కాంగ్రెస్ 59 స్థానాల్లో, బీజేపీ 47 స్థానాల్లో పోటీ చేసింది.

Trending News