పశ్చిమ బెంగాల్‌లో మమతకు షాక్.. బీజేపిలోకి 107 ఎమ్మెల్యేలు: ముకుల్ రాయ్

పశ్చిమ బెంగాల్‌లో బీజేపిలోకి 107 ఎమ్మెల్యేలు ?

Last Updated : Jul 13, 2019, 07:58 PM IST
పశ్చిమ బెంగాల్‌లో మమతకు షాక్.. బీజేపిలోకి 107 ఎమ్మెల్యేలు: ముకుల్ రాయ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీలో చేరేందుకు 107 ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు ముకుల్ రాయ్ అన్నారు. సీపీఎం, కాంగ్రెస్, టీఎంసి పార్టీలకు చెందిన 107 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని ముకుల్ రాయ్ స్పష్టంచేశారు. వాళ్లందరి జాబితాను సిద్ధం చేశామని.. వాళ్లంతా తమతో టచ్‌లోనే ఉన్నారని తేల్చిచెప్పారు. ముకుల్ రాయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో 40 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 18 స్థానాలు గెల్చుకుని టీఎంసి కోటలో బీజేపి గట్టి పాగా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ముకుల్ రాయ్ చేసిన వ్యాఖ్యలు టీఎంసి అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జికి షాక్‌నిస్తాయనే రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Trending News