మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్..!

  

Last Updated : Oct 22, 2017, 06:15 PM IST
మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో తన డ్రీమ్ ప్రాజెక్టైన రోరో సర్వీసును  (రోల్ ఆన్ రోల్ ఆఫ్ సర్వీసు) ప్రారంభించారు. నదీ తీరం ద్వారా ప్రయాణికులను గోఘా నుండి దహేజ్ ప్రాంతానికి చేరవేసే ఈ ఫెర్రీ సర్వీసు 8 గంటల ప్రయాణాన్ని కేవలం ఒక గంటకి కుదించడం విశేషం.

6.5 కోట్ల గుజరాతీయుల ఆకాంక్ష ఈ ప్రాజెక్టు ద్వారా నెరవేరిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు మీద ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేయలేదని, అయినప్పటికీ విజయ లక్ష్యాన్ని తమ సర్కారు చేరుకుందని ఆయన చెప్పారు.

పురాణాల్లో తెలియజేసిన క్షీర సాగరమధనమే ఈ ప్రాజెక్టుకి ఆదర్శమని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలోనే తొలిసారిగా ఈ స్థాయి సర్వీసుకు తమ ప్రభుత్వం నాంది పలికిందని ఆయన పేర్కొన్నారు.

గుజరాత్‌లో ఇంకా మేరీటైమ్ యూనివర్సిటీ మరియు మేరీటైమ్ మ్యూజియం ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. 

Trending News