Train Accident: బిలాస్‌పూర్ సమీపంలో ఘోర ప్రమాదం, రెండు రైళ్లు ఢీ

Train Accident: మధ్యప్రదేశ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని షాహ్‌డోల్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం నేపధ్యంలో చుట్టుపక్కల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2023, 03:43 PM IST
Train Accident: బిలాస్‌పూర్ సమీపంలో ఘోర ప్రమాదం, రెండు రైళ్లు ఢీ

Train Accident: మధ్యప్రదేశ్ షాహ్‌డోల్ జిల్లాలో ఇవాళ రెండు రైళ్లు అత్యంత ఘోరంగా ఢీ కొన్నాయి. రైళ్ల ముందు భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. లోకో పైలట్ మృతి చెందగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 రైళ్లు రద్జయ్యాయి.

ఈ దుర్ఘటన షాహ్‌డోల్ జిల్లాలో బిలాస్‌పూర్-కట్నీ రైలు మార్గంపై జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి తీవ్రంగా ఢీ కొన్నాయి. గూడ్స్ ఇంజన్ సహా 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ రైలు ప్రమాదంలో లోకో పైలట్ మరణించగా, ఆరుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సింహపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 6.50 గంటలకు జరిగింది. బిలాస్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ప్రమాదం తరువాత ధ్వంసమైన ఇంజన్‌లోంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. 

మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ మార్గమధ్యలో ఉంది కట్నీ ప్రాంతం. సిగ్నల్ ఓవర్ టేక్ కారణంగా ఈ రైలు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. 

Also read: Summer Heatwave Warning: మండుతున్న ఎండలు.. పనివేళల మార్పునకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News