నేను ఎన్నుకోబడ్డా.. మీరు నామినేట్ చేయబడ్డారు.. గవర్నర్, మమతల మధ్య మాటల యుద్ధం..

దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేత దశలవారీగా మినహాయింపుజేయాలని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. మే 4 తర్వాత రెండు వారాలకు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని

Last Updated : Apr 24, 2020, 12:50 AM IST
నేను ఎన్నుకోబడ్డా.. మీరు నామినేట్ చేయబడ్డారు.. గవర్నర్, మమతల మధ్య మాటల యుద్ధం..

కోల్ కతా: దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేత దశలవారీగా మినహాయింపుజేయాలని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. మే 4 తర్వాత రెండు వారాలకు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని, ప్రధానితో జరగబోయే సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తే తన మనసులోని మాటను తెలియజేస్తానని అన్నారు. అయితే కొన్ని పరిమితులకు లోబడి లాక్ డౌన్ ఎత్తివేయాలని విమానాలు, రైళ్లను రాష్ట్ర సరిహద్దులు దాటి అనుమతించవద్దని సూచించారు. రాష్ట్రంలో ‘కరోనా’ పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ తగినన్ని కిట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

Also read : Telangana: కొత్తగా 27 కరోనా కేసులు.. జీహెచ్ఎంసీలోనే అధికం

రాష్ట్రంలోని కోవిడ్ -19 పరిస్థితిని పరిశీలించడానికి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసిటి) సందర్శనపై కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ మధ్య తాజా మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ పై మమతా బెనర్జీ స్పందిస్తూ నేను గర్వించదగిన భారత రాష్ట్రానికి ఎన్నికైన ముఖ్యమంత్రినని మీరు మర్చిపోయినట్లు కనిపిస్తోందని అన్నారు. అంతేకాకుండా మీరు నామినేటెడ్ గవర్నర్ అని కూడా మీరు మరచిపోయినట్లు అనిపిస్తుంది. రాజ్యాంగ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను మీరు విస్మరించకూడదన్నారు. గవర్నర్ పాత్ర, అధికారాలు చాలా పరిమితమని, చాలా నామమాత్రంగా ఉన్నాయని ఆమె అన్నారు. గవర్నర్ స్థానం కేవలం అలంకార ప్రాయమని అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News