భారీ వర్షాల హెచ్చరికలతో విద్యా సంస్థలకు సెలవు

భారీ వర్ష సూచనతో విద్యా సంస్థలకు సెలవు

Last Updated : Sep 19, 2019, 04:10 PM IST
భారీ వర్షాల హెచ్చరికలతో విద్యా సంస్థలకు సెలవు

ముంబై : ముంబైలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) హెచ్చరించింది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. ముంబైలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ముఖ్యంగా ముంబైలోని బీచ్ ఒడ్డున, సముద్ర తీర ప్రాంతం, నీళ్లు భారీగా నిలిచే అవకాశమున్న లోతట్టు ప్రాంతాల్లో తిరిగే సాహసం చేయవద్దని బీఎంసి (బృహత్ ముంబై కార్పొరేషన్‌) అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఇదిలావుంటే, ఈ వర్షాకాలంలో కురిసిన అతి భారీ వర్షాలతో గత రెండు నెలలుగా ముంబై నగర జనజీవనం అస్తవ్యస్తంగా తయారైన సంగతి తెలిసిందే.

Trending News