Minor girls Raped : మూడేళ్ల బాలికపై 26 ఏళ్ల యువకుడి హత్యాచారం.. పది రోజుల్లో ముగ్గురిపై రేప్

Man rapes three minor girls : గుజరాత్‌లో దారుణం జరిగింది. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు మైనర్ బాలికలపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.వీరిలో ఓ బాలికను అత్యాచారం అనంతరం హత్య చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 07:23 PM IST
  • గుజరాత్‌లో వెలుగుచూసిన దారుణం
    ముగ్గురు మైనర్ బాలికలపై కామాంధుడి అత్యాచారం
    మూడేళ్ల బాలికపై అత్యాచారం,హత్య
    10 రోజుల వ్యవధిలోనూ ముగ్గురిపై అఘాయిత్యం
Minor girls Raped : మూడేళ్ల బాలికపై 26 ఏళ్ల యువకుడి హత్యాచారం.. పది రోజుల్లో ముగ్గురిపై రేప్

Gujarat rape case : గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మూడేళ్ల బాలికపై 26 ఏళ్ల యువకుడు హత్యాచారానికి (Rape and Murder) పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత 10 రోజుల్లో ఆ నిందితుడు మొత్తం ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు.

గాంధీనగర్ ఐజీ అభయ్ వెల్లడించిన వివరాల ప్రకారం... నిందితుడిని విజయ్ ఠాకూర్‌గా గుర్తించారు. దినసరి కూలీగా పనిచేస్తున్న విజయ్ గత 10 రోజుల వ్యవధిలో 3,5,7 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి (Rape on minor girls) పాల్పడ్డాడు. వీరిలో మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటమే గాక హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ కల్వర్ట్ సమీపంలో పడేశాడు. ఈ నెల 4న ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక మృతదేహంపై సమాచారం అందడంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇటీవల నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. విజయ్ అరెస్ట్ తర్వాత పోలీసులకు మరిన్ని విస్తుపోయే విషయాలు తెలిశాయి. మూడేళ్ల బాలికపై హత్యాచారానికి  (Rape and Murder) పాల్పడిన మరుసటిరోజే మరో బాలిక(5)పై కూడా అతను అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. రంచర్దా గ్రామానికి చెందిన ఆ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. మరో ఏడేళ్ల బాలికపై కూడా  అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. మూడేళ్ల బాలికపై అత్యాచార సమయంలో ఆ చిన్నారి గట్టిగా కేకలు పెట్టడం వల్లే ఆమెను చంపేశానని విచారణలో వెల్లడించాడు.

Also Read:Panjagutta child murder : పంజాగుట్ట చిన్నారి మృతదేహం కేసులో దర్యాప్తు ముమ్మరం

నిందితుడు విజయ్‌కి భార్య,కుమార్తె ఉన్నట్లు చెప్పారు.సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూడటం అతనికి ఓ వ్యసనంగా మారిందన్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో (POCSO act) పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఇదే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన మరో ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు హత్యాచారానికి (Crime against women) పాల్పడ్డాడు. గత గురువారం తప్పిపోయిన ఆ బాలిక రెండు రోజుల క్రితం ఓ ఫ్యాక్టరీ సమీపంలో శవమై కనిపించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News