నదిలో పడిన వ్యాన్.. 11 మంది మృతి!

వ్యాన్ నదిలో పడి 11 మంది మృతి, 13 మందికి గాయాలు

Last Updated : Sep 14, 2018, 12:48 PM IST
నదిలో పడిన వ్యాన్.. 11 మంది మృతి!

తెలంగాణలోని కొండగట్టు వద్ద బస్సు ఘాట్ రోడ్డుపై నుంచి లోయలో పడిన ప్రమాదంలో 50కిపైగా మంది దుర్మరణంపాలైన దుర్ఘటన ఇంకా మరవకముందే జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఇంచుమించు అటువంటి ఘోర రోడ్డుప్రమాదం మరొకటి చోటుచేసుకుంది. మోతాదుకుమించిన సంఖ్యలో ప్రయాణికులతో కెశ్వా్న్ నుంచి కిష్టావర్ బయల్దేరిన మినీ వ్యాన్ శుక్రవారం ఉదయం 9:55 గంటలకు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 13 మంది గాయపడినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. రోడ్డుపై నుంచి లోతైన నదిలో వ్యాన్ పడిపోవడంతో పై నుంచి తాళ్ల సహాయంతో క్షతగాత్రులను వెలికి తీసి వెనువెంటనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఏఎన్ఐ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. 

Trending News