రైలు బోగీలే దిక్కు..

కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 36 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,214 మంది దీని బారిన పది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు

Last Updated : Jun 14, 2020, 04:22 PM IST
రైలు బోగీలే దిక్కు..

ఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 36 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,214 మంది దీని బారిన పది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. బెడ్లు లేక రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బయటి వారికి తాము వైద్యం చేయలేమని సీఎం కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో ఢిల్లీ దయనీయ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దేశ రాజధానిలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

Also Read: Breaking: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్

ఈ విపత్కర పరిస్థితిపై ఢిల్లీ ప్రజల రక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, కరోనా రోగులకు పడకల కొరత దృష్ట్యా రైల్వే కోచ్ లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఢిల్లీకి కేంద్రం 500 రైల్వే కోచ్ లను అందిస్తుందని, రైల్వే కోచ్ ల ద్వారా 8 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని అమిత్ షా వివరించారు. ఈ రైల్వే కోచ్ లో కరోనా రోగులకు అన్ని సదుపాయాలు ఉంటాయని, వచ్చే రెండు రోజుల పాటు ఢిల్లీలో కరోనా టెస్టులు రెట్టింపు చేయాలని, మరో 6 రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News