ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతు బంధు పథకానికి కాపీనే : టీఆర్ఎస్

కేంద్రం కాపీ కొట్టింది : టీఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్

Last Updated : Feb 1, 2019, 07:02 PM IST
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతు బంధు పథకానికి కాపీనే : టీఆర్ఎస్

న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్నే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని టీఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్ ఆరోపించారు‌. నేడు కేంద్రం తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్‌ను రాజకీయ లబ్దికే అధిక ప్రాధాన్యం కల్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా రూపొందించారని వినోద్ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు ప్రకటించినంత సులువు కాదని, పథకం అమలులో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని వినోద్ అభిప్రాయపడ్డారు. 

Trending News