పట్టపగలే బ్యాంకు దోపిడీ; క్యాషియర్‌ను కాల్చిచంపిన దుండగులు

పట్టపగలే బ్యాంకు దోపిడీ; క్యాషియర్‌ను కాల్చిచంపిన దుండగులు

Last Updated : Oct 13, 2018, 12:36 PM IST
పట్టపగలే బ్యాంకు దోపిడీ; క్యాషియర్‌ను కాల్చిచంపిన దుండగులు

దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి చొరబడి  భీభత్సం సృష్టించారు. మాస్కులు ధరించి వచ్చిన ఆగంతకులు మారణాయుధాలతో బెదిరించి దొరికినంత డబ్బును దోచుకెళ్లారు. అడ్డుకున్న క్యాషియర్‌ను తుపాకితో కాల్చి చంపారు. పూర్తి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన ఢిల్లీ ఖైరాలోని కార్పోరేషన్‌ బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది.

శుక్రవారం యధావిధిగా బ్యాంకు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా దోపిడీ దొంగలు బ్యాంకులోకి ప్రవేశించారు. అక్కడున్న కస్టమర్లు, సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారు. ఎవరినీ చంపమని చెప్పిన దుండగులు.. ఆ తర్వాత క్యాషియర్‌ అడ్డుకోవడంతో తుపాకీతో కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. కొన ఊపిరితో ఉన్న క్యాషియర్‌‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదవడంతో.. ఈ దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

కాగా మృతి చెందిన క్యాషియర్‌ సంతోష్‌కుమార్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. రిటైర్ అయ్యాక సంతోష్‌ కార్పోరేషన్‌ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. సంతోష్‌‌కు ఓ భార్య ఇద్దరు పిల్లలున్నారు.

 

Trending News