అయోధ్యను సందర్శించిన ప్రపంచ శాంతి బృందం

ప్రపంచ శాంతి ప్రతినిధి బృంద సభ్యులు అయోధ్యను సందర్శించి, రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఏకాభిప్రాయ పరిష్కారాన్ని సూచించారు.

Last Updated : Jan 8, 2018, 01:40 PM IST
అయోధ్యను సందర్శించిన ప్రపంచ శాంతి బృందం

ప్రపంచ శాంతి ప్రతినిధి బృంద సభ్యులు అయోధ్యను సందర్శించి, రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఏకాభిప్రాయ పరిష్కారాన్ని సూచించారు. పుణెలోని ఎంఐటీ ప్రపంచ శాంతి విశ్వవిద్యాలయానికి విచ్చేసిన విశ్వనాథ్ కరాద్ నాయకత్వంలో, 11 మంది సభ్యుల ప్రపంచ శాంతి ప్రతినిధి బృందం అయోధ్యలో వివాదాస్పద ప్రదేశాన్ని సందర్శించారు. 

నలంద విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, విజయ్ భట్కర్, ఎంఐటీ ప్రపంచ శాంతి విశ్వవిద్యాలయం అధ్యక్షుడు విశ్వనాథ్ కరద్, నాగ్పూర్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, ఎస్.ఎన్.పఠాన్, సీనియర్ జర్నలిస్ట్ వేదప్రతాప్ వైదిక్, సీనియర్ సైంటిస్ట్ రాజేంద్ర ఎండే, మాజీ కేంద్ర మంత్రి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఫిరోజ్ బఖ్ అహ్మద్, సుప్రీం కోర్టు న్యాయవాది సిరాజ్ ఖురేషిలు ఈ బృందంలో ఉన్నారు. 

విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించాలని ప్రతినిధి బృందం నొక్కి చెప్పారు. వివాదాస్పద ప్రదేశంలో రాముడి దేవాలయాన్ని నిర్మించి, అయోధ్య మానవజాతి, ప్రపంచ శాంతి సందేశాలను ఇవ్వాలన్నది ఈ  ప్రపంచ శాంతి ప్రతినిధి బృందం యొక్క ప్రధాన లక్ష్యం.  ఫిబ్రవరి 8న సుప్రీంకోర్టులో అయోధ్య పై తుది విచారణ జరగనుంది.

Trending News