45 మంది పిల్లలతో కుంటలో బోల్తా పడిన స్కూల్ బస్సు

Last Updated : Aug 7, 2018, 03:30 PM IST
45 మంది పిల్లలతో కుంటలో బోల్తా పడిన స్కూల్ బస్సు

45 మంది పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ కుంటలో బోల్తా పడిన దుర్ఘటనలో 20 మంది చిన్నారులు గాయపడినట్టు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌కి సమీపంలోని ఖైరా గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడిన చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. బస్సు బోల్తా పడిన కుంటలో నీళ్లు ఉండటంతో గాయపడిన చిన్నారుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

 

ఈ ఘటన వెనుకున్న కారణాలు, మిగతా చిన్నారుల పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Trending News