Assembly Elections 2021 Results Live News Update: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యం

Assembly Elections 2021 Results Live News Update: దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఊహించినట్టే పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2021, 10:10 AM IST
Assembly Elections 2021 Results Live News Update: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యం

Assembly Elections 2021 Results Live News Update: దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఊహించినట్టే పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ( 5 State Assembly Elections Results) ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలు, తమిళనాడులో 234, కేరళ 140, అస్సోం 130, పుదుచ్చేరి 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో 8 దశల్లో జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా ఊహించినట్టే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఎంసీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి  వరకూ 149 స్థానాల్లో టీఎంసీ, 119 స్థానాల్లో బీజేపీ ఆదిక్యంలో ఉన్నాయి. 

Also read: Lockdown in India: మే 3 నుంచి లాక్‌డౌన్ విధిస్తారా ? PIB Fact check ఏం చెబుతోంది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News