ఒకే ఇంట్లో ఐదు శవాలు

ఢిల్లీలో మరోసారి సామూహిక శవాలు సంచలనం కలిగిస్తున్నాయి. గతంలో బురారీ ప్రాంతంలో  వెలుగు చూసిన లాంటి ఘటనే మరోసారి ఢిల్లీలో కనిపించింది. ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు అనుమానస్పద స్థితిలో వెలుగులోకి వచ్చాయి. 

Last Updated : Feb 12, 2020, 03:59 PM IST
ఒకే ఇంట్లో ఐదు శవాలు

ఢిల్లీలో మరోసారి సామూహిక శవాలు సంచలనం కలిగిస్తున్నాయి. గతంలో బురారీ ప్రాంతంలో  వెలుగు చూసిన లాంటి ఘటనే మరోసారి ఢిల్లీలో కనిపించింది. ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు అనుమానస్పద స్థితిలో వెలుగులోకి వచ్చాయి. ఈసారి ఈ ఘటన ఢిల్లీలోని భజన్ పురా ప్రాంతంలో జరిగింది.  ఐతే వారు ఆత్మహత్య చేసుకున్నారా.. ? లేదా వారిని ఎవరైనా హత్య చేశారా .. ?  అనే విషయం తెలియాల్సి ఉంది. 

మొత్తం ఐదు డెడ్ బాడీస్ ఉండగా .. అందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ కుటుంబం అక్కడ నివాసం ఉండేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు ఆ ఇంటిలో ఉంటారని స్థానికులు చెబుతున్నారు. వారిని 43 ఏళ్ల శంభునాథ్, 38 ఏళ్ల సునీత, కుమార్తె కవిత, కుమారుడు సచిన్, మరో కుమారుడుగా గుర్తించారు. 

వారి మృతదేహాలు ఇంటి లోపల ఉండగా.. ఇంటి బయట నుంచి తాళం వేసి ఉంది. దీంతో వారిని ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిలో క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేస్తున్నారు. వారు నాలుగు ఐదు రోజుల క్రితమే చనిపోయినట్లుగా చెబుతున్నారు. మృతదేహాలు కుళ్లిపోయి వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Trending News