Raisins For Weight Loss: చలి కాలంలో ఊబకాయం, బీపీకి ఈ నీటితో 7 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Raisins For Weight Loss: చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 04:29 PM IST
 Raisins For Weight Loss: చలి కాలంలో ఊబకాయం, బీపీకి ఈ నీటితో 7 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Raisins For Weight Loss: తరచుగా స్వీట్ డిష్ తయారు చేసే క్రమంలో తప్పకుండా వినియోగించే వాటిలో ఎండుద్రాక్ష ఒకటి. ఇది నోటికి తిపి కలిగి ఉన్న వీటిని క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్, ఐరన్, ఫైబర్, పొటాషియం, కాపర్, విటమిన్ B6, కాల్షియం, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా వీటిని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండుద్రాక్ష తరచుగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మలబద్ధకం సమస్యలకు చె
క్‌:
ఎండుద్రాక్షలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తగ్గి మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది.

బరువు నియంత్రిస్తుంది:
ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నవారికి ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టుకుని తింటే శరీర బరువు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్, ప్రీబయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

పొట్టను శుభ్రమవుతుంది:
మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎండుద్రాక్ష సమర్థవంతంగా పని చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష, మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల పొట్ట శుభ్రంగా మారి.. పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు, అజీర్ణం వంటి సమస్యలకు చెక్‌ పెడుతాయి.

బీపీని అదుపులో ఉంటుంది:
ఎండుద్రాక్షలో ఫైబర్‌తో పాటు పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే బీపీని అదుపులో ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీటిని తాగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దయచేసి దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు

Also Read: Ind vs Eng Semi Final Match: ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్ ఓటమికి కారణాలు ఇవేనా ?

Also Read: T20 World Cup: రోహిత్, విరాట్ కోహ్లి గుడ్ బై.. బీసీసీఐ సంచనల నిర్ణయాలు..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News