/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

ఈ రోజు సోషల్ మీడియాలో షారుఖ్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే డిసెంబరు 21 తేదిన షారుఖ్ తాజాచిత్రం "జీరో" విడుదలవుతోంది. అంటే ఈ రోజు నుండి సరిగ్గా అయిదు నెలల తర్వాత ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అందుకే "5 మంత్స్ టు జీరో" పేరిట సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రారంభించారు ఆయన అభిమానులు. తాము ఆ చిత్రం కోసం కళ్లు కాయలు చేసుకొని మరీ వేచి చూస్తున్నామని.. వేగంగా ఆ చిత్రాన్ని విడుదల చేసి తమ ఆశలను నెరవేర్చమని కోరుతున్నారు.

"5 మంత్స్ టు జీరో" క్యాంపైన్‌లో భాగంగా షారుఖ్ ఫోటోలు, మేమ్స్ తెగ షేర్ చేస్తున్నారు. "జీరో" చిత్రంలో షారుఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ, కాజోల్, అలియాభట్, కరిష్మా కపూర్, జూహీ చావ్లా, మాధవన్ మొదలైన వారందరూ ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ అతుల్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. షారుఖ్ సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను చేపడుతోంది.  ఈ చిత్రంలో షారుఖ్ సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభయ్ డియోల్, తిగ్మాంశు దులియా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

Section: 
English Title: 
Sharukh Khans started a campaign called 5 Months to Zero
News Source: 
Home Title: 

ఈ రోజు షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగ

ఈ రోజు షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగ
Caption: 
Image Credit: Twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఈ రోజు షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగ