వరుణ్ తేజ్ విలన్ పాత్రకు ..సై అంటాడా..నై అనేస్తాడా ?

                                                               

Last Updated : Nov 19, 2018, 04:08 PM IST
వరుణ్ తేజ్ విలన్ పాత్రకు ..సై అంటాడా..నై అనేస్తాడా ?

ఇటీవలి కాలంలో సినిమాల్లో ప్రతినాయకుడికి హీరోతో సమానంగా క్రేజ్ ఉంటోంది. దర్శక నిర్మాతలు ఇలాంటి పాత్రలు సృష్టిస్తున్నారు మరి. పద్మావత్, బాహుబలి సినిమాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. బాహుబలి మూవీలో రాణా విలన్ పాత్రలో నటించి అభిమానులను ఎంతగా ఆకట్టుకున్నాడో అందరికీ తెలిసిందే.  హీరో ప్రభాస్ కు సమానమైన క్రేజ్ రాణాకు దక్కింది. ఈ క్రమంలో దిల్ రాజు తీస్తున్న ఓ సినిమాలో ప్రతి నాయకుడికి 'కీ' రోల్ ఇచ్చే పాత్రలో నటించేందుకు వరుణ్ తేజ్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు చేస్తోంది

ఇటీవలె తమిళంలో సిద్ధార్థ్ హీరోగా బాబీ సింహా విలన్ గా వచ్చిన 'జిగర్తాండా' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం వరుణ్ తేజ్ అయితే బాగుంటాడని భావించిన దిల్ రాజు ..ఈ మేరకు ఆతన్ని సంప్రదించినట్లు తెలిసింది. అయితే దీనిపై వరణ్ తేజ్ స్పందించలేదట. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ .. విభిన్నంగా ముందుకు వెళ్తున్నహీరో వరణ్ తేజ్....దిల్ రాజు ప్రతిపాదనకు సై అంటాడా..లేందటే సైలెంట్ గా నై అనేస్తాడా..? అనే దానిపై  స ర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Trending News