ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై అల్లు అర్జున్, సుకుమార్ మూవీ

అల్లు అర్జున్, సుకుమార్ మూవీ అప్‌డేట్

Last Updated : Oct 30, 2019, 04:08 PM IST
ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై అల్లు అర్జున్, సుకుమార్ మూవీ

సుకుమార్ తెరకెక్కించిన చివరి చిత్రం రంగస్థలం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో #AA20 సినిమాను తెరకెక్కించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడు. ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ సినిమాలను ఆడియెన్స్‌కి అందించిన ఈ హిట్ కాంబోలో సినిమా అంటే ఆడియెన్స్‌లో భారీ అంచనాలే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచింగ్ జరుపుకుంది. దర్శకులు కొరటాల శివ, సురేందర్ రెడ్డి, నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చుట్టూ తిరిగే కథనం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన జంటగా నటించనున్నట్టు సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్‌లకు ఎన్నోసార్లు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కనున్న సినిమా కావడంతో తిరుమలలోని శేషాచలం ప్రాంతంలో ఓ భారీ సెట్టింగ్‌కి ప్లాన్ చేసినట్టు సమాచారం.

 

Trending News