Rajamouli: తన టీమ్ ని మార్చే ఆలోచనలో రాజమౌళి..మహేష్ బాబు సినిమాతోనే మొదలు..

Rajamouli-Mahesh Babu: ప్రస్తుతం తెలుగు వారి అందరి దృష్టి రాజమౌళి తదుపరి సినిమా పైనే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లి సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మొదలుపెట్టనున్నారు. కాగా ఈ సినిమా మొదలవ్వకముందే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2023, 10:18 AM IST
Rajamouli: తన టీమ్ ని మార్చే ఆలోచనలో రాజమౌళి..మహేష్ బాబు సినిమాతోనే మొదలు..

Rajamouli: భారతీయ సినిమా ని ప్రపంచ స్థాయి లో తీసుకెళ్ళి కుర్చోబెట్టిన దర్శక దిగ్గజం మన  
ఎస్.ఎస్ రాజమౌళి. ఇప్పటికి వరకు కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా చూడని రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచి మన తెలుగు వాళ్లకి ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చారు. అలాంటి రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చెయ్యబోతున్నారు.

ఆర్.ఆర్.ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రాజమౌళి ఎవరిని డైరెక్ట్ చేస్తాడు అని ఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూసింది. కొంతమంది అయితే రాజమౌళి తన తదుపరి సినిమాగా ఆర్.ఆర్.ఆర్ పార్ట్ 2 ని డైరెక్ట్ చేస్తాడు అని అనుకున్నారు, కానీ రామ్ చరణ్ అటు గేమ్ చెంజర్ తో, ఇటు ఎన్టీఆర్ దేవర సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల ఆ రుమౌర్స్ కి చెక్ పడ్డాయి. ఇక వెంటనే రాజమౌళి కూడా లేట్ చెయ్యకుండ తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోతున్నాను అని ప్రకటించేసాడు ఒకానొక ఇంటర్వ్యూ లో.

ఈ సినిమా ఇంకా అధికారికంగా మొదలవుకుండానే అందరిలో అంచనాలు పెంచేసాయి. అందరి అంచనాలకి తగ్గట్టుగానే రాజమౌళి కూడా ఈ సినిమా రూపొందించే పనిలో పడ్డారు అని వినిపిస్తుంది. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలు అన్నింటికీ సెంథిల్ కుమార్ కెమరామెన్ గా వ్యవహరించారు. కానీ మొట్టమొదటి సారి రాజమౌళి సెంథిల్ కుమార్ ని కాదు అనుకోని పి.ఎస్ వినోద్ ని కెమరామెన్ గా తీసుకోవాలని అనుకుంటునట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కెమరామెన్ నే కాకుండా సినిమాకి పని చేసే ముఖ్య వ్యక్తులని కూడా రాజమౌళి మార్చాలని ఆలోచిస్తున్నారు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరి కొందరేమో ఎం.ఎం. కీరవాణి కూడా మహేష్ బాబు సినిమా కి పని చేస్తారా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కూర్చొని కథకి తుది మెరుగులు దిద్దుతున్నారు అని తెలుస్తుంది. 2024 లో మొదలయ్యే ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ తో పాటు యావత్ ఇండియన్ సినిమా ఎదురుచూస్తుంది.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News