NTR Family To Visit Delhi: ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు.. తారకరత్న భార్య కూడా..

NTR Family To Visit Delhi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రం ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరిట రూ. 100 నాణెం విడుదల కానుంది.

Written by - Pavan | Last Updated : Aug 25, 2023, 05:53 AM IST
NTR Family To Visit Delhi: ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు.. తారకరత్న భార్య కూడా..

NTR Family To Visit Delhi: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గౌరవార్థం ఆయన పేరుపై రూ. 100 నాణెం విడుదల కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ నెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆగస్ట్ 28న ఈ కార్యక్రమం ఉండనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరిట రూ. 100 నాణెం విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు కేంద్రం ఎన్టీఆర్ వారసులు, వారి కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపించినట్టు సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రం ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ రూ. 100 నాణేనికి అన్ని ఇతర నాణేల తరహాలోనే ఒక వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం చిహ్నం ఉండనుండగా.. మరోవైపు ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉంటాయి. 2023 ఎన్టీఆర్ శతజయంతి పూర్తయిన నేపథ్యంలో ఎన్టీఆర్ ముఖ చిత్రం కింది భాగంలో నందమూరి తారక రామారావు శతజయంతి 1923- 2023 అని హిందీలో ముద్రించడం విశేషం.

చంద్రబాబుకు ఒకే పర్యటనలో రెండు పనులు
ఇదిలావుంటే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ పేరిట రూ. 100 నాణెం విడుదల కార్యక్రమంతో పాటు ఇదే పర్యటనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను సైతం చంద్రబాబు కలననున్నారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు తొలగించి, అనర్హుల పేర్లు చేర్చడం వంటి అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇదే విషయమై చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. 

ఇది కూడా చదవండి : RRR At 69th National Film Awards: నేషనల్ ఫిలిం అవార్డ్స్ మైదానంలో సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్ మూవీ

బాలయ్య బాబు నుండి తారక రత్న భార్య వరకు..

ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, వారి వారి వారసులకు ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయం అయ్యేలా నందమూరి కుటుంబం అంతా ఒక్క చోటకు చేరుతున్నట్టు సమాచారం. బాలయ్య బాబు నుండి మొదలుపెడితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు ఇటీవల తారకరత్న కన్నుమూసిన నేపథ్యంలో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి వరకు ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఫిలింనగర్ టాక్.

ఇది కూడా చదవండి : 69th National Film Awards 2023 Winners: అల్లు అర్జున్, RRR, ఉప్పెన, చంద్రబోస్.. మళ్లీ తెలుగు వాళ్లదే హవా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News