'యాత్ర 2' ఫ‌స్ట్ లుక్ విడుదల.. వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి.. వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా!

ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర.. సీక్వెల్ గా యాత్ర 2 సినిమా కూడా చిత్రీకరణ పూర్తవ్వనుంది. మమ్ముటి రాజశేఖర్ పాత్ర పోషిస్తుంటే.. హీరో జీవ జగన్ పాత్ర పోషించనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2023, 12:57 PM IST
'యాత్ర 2' ఫ‌స్ట్ లుక్ విడుదల.. వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి.. వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా!

Yatra2 Movie Poster: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. 2019 లో ఫిబ్రవరి 8న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. మహి వి రాఘవ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా యాత్ర 2 సినిమాకి కూడా మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. 

మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి,  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, పాత్రలకు సంబంధించిన  ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. 

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే, మ‌మ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్‌ను కూడా పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. పోస్ట‌ర్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. 

Also Read: Revanth Reddy: మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ: రేవంత్ రెడ్డి  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా, వైఎస్‌.ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెర‌కెక్కిస్తున్నారు. 

‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Chandrababu Case Updates: లోకేశ్‌కు ఊరట, చంద్రబాబు బెయిల్‌పై రేపటికి విచారణ వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News