Dil Raju Varusudu : దిల్ రాజుకు షాకిచ్చిన మైత్రీ-యూవీ.. వారికి షాకిచ్చేందుకు సర్వం సిద్ధం!

Dil Raju to Release Varusudu For Sankranthi 2023: 2023 సంక్రాంతి సీజన్ విషయంలో దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 23, 2022, 08:05 PM IST
Dil Raju Varusudu : దిల్ రాజుకు షాకిచ్చిన మైత్రీ-యూవీ.. వారికి షాకిచ్చేందుకు  సర్వం సిద్ధం!

Dil Raju to Release Varusudu For Sankranthi 2023: 2023 సంక్రాంతి సీజన్ మీద సినీ ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి విడుదల చేస్తామని ఆదిపురుష్ సినిమా యూనిట్ ప్రకటించింది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందుతున్న వారసుడు సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇక ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అలాగే మెగాస్టార్ హీరోగా నటిస్తున్న 154వ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ చిరంజీవి సినిమాలు రెండు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న నేపథ్యంలో ఒకే సమయంలో విడుదల చేయకపోవచ్చు అని అంచనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు తాజాగా అమ్ముతున్న సమాచారం మేరకు ఒకేసారి విడుదల చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఒకటి రెండు రోజుల గ్యాప్ తో సినిమాలను విడుదల చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సంక్రాంతికి ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు కష్టం కాబట్టి దిల్ రాజు తన సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి బాలకృష్ణ ఈ రెండు సినిమాలకు సంబంధించిన నైజాం, విశాఖపట్నం హక్కులు సంపాదించేందుకు ప్రయత్నాలు చేశారు.

కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆ రెండు సినిమాల హక్కులు బయట వారికి అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శశి మేనేజ్ చేసే విధంగా ఒక సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేసి తమ సినిమాలను తామే డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మరో పెద్ద నిర్మాణ సంస్థను కూడా కలుపుకోవాలని వారు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నైజాంలో థియేటర్లు ఎక్కువ ఏషియన్ సంస్థకు ఉన్నాయి.

కాబట్టి దిల్ రాజుతో పెద్దగా సమస్య లేనట్టేనని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భావిస్తుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఆది పురుష్ సినిమా హక్కుల కోసం కూడా ప్రయత్నించారని కానీ ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న యూవీ సంస్థ ఆ హక్కులు కూడా దిల్ రాజుకు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ‘వారసుడు’ సినిమాని రంగంలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తనకు సినిమా ఇవ్వకపోతే కచ్చితంగా తన సినిమా రిలీజ్ చేసేందుకే దిల్ రాజు సిద్ధమవుతున్నారు అంటూ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది.  

Also Read: Amitabh Hospitalised: కౌన్ బనేగా కరోడ్పతి షూట్లో ప్రమాదం.. తీవ్ర రక్తస్రావంతో హుటాహుటిన హాస్పిటల్ కు?

Also Read: Rishabh Shetty Ram Charan: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్.. మెగా హీరోతో రిషబ్ పాన్ ఇండియా మూవీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News