Actress Sada : సినిమా చూస్తూనే ఎమోషనల్.. కన్నీటి పర్యంతం అయిన సదా

Actress Sada Cried : హీరోయిన్ సదా తాజాగా ఒక సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తరువాత ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాను అనే విషయం మీద స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 06:44 PM IST
  • సినిమా చూస్తూ కన్నీటి పర్యంతం అయిన సదా
  • ఆ విషయాలు గుర్తు వచ్చాయంటూ కామెంట్
  • మేకర్స్ కు హాట్సాఫ్ చెప్పిన సదా
 Actress Sada : సినిమా చూస్తూనే ఎమోషనల్.. కన్నీటి పర్యంతం అయిన సదా

Actress Sada Cried : వెళ్లవయ్యా వెళ్ళు వెళ్ళూ అంటూ జయం సినిమాలో డైలాగ్ తో ఫేమస్ అయింది సదా. అలా హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ కావడంతో ఆమె కెరీర్లో వరస సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ప్రస్తుతానికి కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సినీ అవకాశాలు కాస్త తగ్గడంతో గ్యాప్ తీసుకున్న ఆమె తన మనసుకు నచ్చిన కొన్ని మంచి పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ మధ్యనే టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్న ఆమె తాజాగా ఒక సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
 
మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన సదా టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత మంచి క్రేజ్ సంపాదించారు. తర్వాత తమిళం సహా దక్షిణాది భాషల్లో మరికొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే కొద్ది రోజుల నుంచి తెలుగులో కొన్ని టెలివిజన్ షో లకు ఆమెను అడపాదడపా జడ్జిగా తీసుకొస్తున్నారు. ఆ సంగతలా వుంచితే తాజాగా ఆమె మేజర్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని అద్భుతమైన కలెక్షన్లు కూడా రాబడుతున్న సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె సినిమా వీక్షిస్తూ కన్నీళ్ళ పర్యంతం అయ్యింది. ఈ విషయాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక సినిమా చూడడం పూర్తయిన తర్వాత సదా సినిమా మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నది. స్వతహాగా తాను ముంబైలోనే ఉంటాను కాబట్టి ఈ ఉగ్రదాడులు జరిగిన సమయంలో కూడా ముంబైలోనే ఉన్నాను అని ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే అప్పుడు ఏదైతే ఒక ఒక ఫీలింగ్ తనకు కలిగిందో సినిమా చూస్తున్నపుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది అని చెప్పుకొచ్చింది.. ఇక హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క అద్భుతమైన ప్రదర్శన కనపరిచి సినిమాను అద్భుతంగా రూపొందించారని ఆమె పేర్కొన్నారు.
  
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో ఆఫీసర్ అయిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన ప్రాణాలకు తెగించి ముంబై ఉగ్రదాడులలో అనేక మందిని కాపాడారు. అయితే అదే సమయంలో ఆయన ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి విని ఆయన గురించి తెలుసుకుని ఎలా అయినా ఆయన గురించి సినిమా చేసి భారతీయులందరికీ ఆయన తెలియజేయాలని భావించిన అడివి శేష్ చాలా కాలం రీసెర్చ్ చేసి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల వద్ద పర్మిషన్ తీసుకుని మరీ సినిమాను మన ముందుకు తీసుకు వచ్చారు. 
Also Read: Major Movie Promotion: సినిమా టికెట్ కోసం క్యూలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, వీడియో వైరల్

Also Read: Adivi Sesh Health update: ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హీరో అడివి శేష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News