Tamil Nadu Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు దుర్మరణం

Tirupattur Road Accident: ఆగి ఉన్న టూరిస్ట్ వాహనాన్ని వెనుక నుంచి ఏచర్ వాహనం ఢీకొనడంతో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కుప్పం సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 14 మంది క్షతగాత్రులు అవ్వగా.. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 11, 2023, 11:04 AM IST
Tamil Nadu Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు దుర్మరణం

Tirupattur Road Accident: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. కుప్పం సరిహద్దు ప్రాంతంలోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఆగి ఉన్న టూరిస్ట్ వ్యాన్‌ను ఏచర్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను ఎం.మీనా (50), డి.దేవయాని (32), పి.సైత్తు (55), ఎస్‌.దేవిక (50), వి.సావిత్రి (42), కె.కళావతి (50), ఆర్‌.గీత (34)గా గుర్తించారు. మృతులను తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని పెర్నంబుట్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

పెర్నాంబుట్ పట్టణంలోని ఎనిమిది మంది బంధువులతో పాటు ఈ నెల  8 నుంచి పర్యాటక కేంద్రాలకు పర్యాటక సందర్శనలో ఉన్నారు. ఇందుకోసం వారు టూరిస్ట్ వ్యాన్‌ను అద్దెకు తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించి హైవేపై ఇంటికి తిరిగి వస్తుండగా.. వ్యాన్ ముందు చక్రం టైరు పంక్చర్ అయింది. దీంతో వ్యాన్‌లో ఉన్న వారంతా వాహనం దిగి వ్యాన్‌కు సమీపంలో ఉన్న ఒక అడుగు ఎత్తులో ఉన్న కాంక్రీట్ మీడియన్‌పై కూర్చున్నారు. వాహనంలోని డేంజర్ లైట్లు.. అదనపు లైట్లు పనిచేస్తున్నాయి.

క్లాస్‌రూమ్‌లకు సంబంధించిన స్మార్ట్‌బోర్డులతో బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఏచర్ లారీ డ్రైవర్‌ పి.అరుణాచలం (34) వ్యాన్‌ను గమనించలేదు. దీంతో ఆగి ఉన్న వ్యాన్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో వాహనం సమీపంలోని మీడియన్‌పై కూర్చున్న వారిపై వ్యాన్‌ పడిపోవడంతో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు నాట్రంపల్లి పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ పెట్రోలింగ్ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించారు. అనంతరం వారిని కృష్ణగిరి, తిరుపత్తూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి, వాణియంబాడి ప్రభుత్వ తాలూకా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాట్రంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపత్తూరు కలెక్టర్ డి.భాస్కర పాండియన్ తిరుపత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.  

Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?

Also Read: Chandrababu Case: చంద్రబాబు కేసులో కీలక పరిణామాలు, అటు కస్టడీ, ఇటు బెయిల్‌పై ఉత్కంఠ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News