Budget 2022: ఆశల పద్దు 2022.. బడ్జెట్​పై వివిధ వర్గాల్లో అంచనాలు ఇవే..

Budget 2022: కరోనా సంక్షోభం నడుమే మరోసారి కేంద్రం వార్షిక బడ్జెట్​ను ప్రవెశపెట్టనుంది. ఉద్యోగులు, మహిళలు ఈ సారి పద్దు నుంచి ఏం కోరుకుంటున్నారు? వారి అంచనాలు ఎలా ఉన్నాయి?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 08:40 AM IST
  • నేడు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2022-23
  • వేతన జీవుల్లో పద్దుపై భారీ ఆశలు
  • ప్రోత్సహకాలుపెంచాలని మహిళా పారిశ్రామికవేత్తల డిమాండ్​
Budget 2022: ఆశల పద్దు 2022.. బడ్జెట్​పై వివిధ వర్గాల్లో అంచనాలు ఇవే..

Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022-23 నేడు పార్లమెంట్​ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్​లో పద్దుపై ప్రసంగించనున్నారు.

కొవిక్​ సంక్షోభం కాలంలో వస్తున్న రెండో బడ్జెట్​ ఇది. దీనితో ఈ సారి కూడా పేపర్​లెస్ బడ్జెట్​ను ప్రవేశ పెట్టనుంది కేంద్రం.

పేపర్​ లెస్​ బడ్జెట్ అయినందున అందరికీ బడ్జెట్​ వివరాలు స్పష్టంగా తెలిసే విధంగా యూనియన్​ బడ్జెట్ యాప్​ను తీసుకొచ్చింది కేంద్రం. నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్​ 2022కు సంబంధించిన అన్ని వివరాలను ఈ యాప్​లో చూడొచ్చు.

బడ్జెట్​ 2022-23పై వివిధ వర్గాల అంచనాలు..

ఉద్యోగులు: స్టాండ్డర్డ్​ డిడక్షన్​ పరిమితి  పెంచొచ్చని వేతన జీవులు ఆశిస్తున్నారు. ఈ డిడక్షన్​ జీతంలో పన్నులేని ఆదాయాన్ని పెంచుతుంది.

ఉద్యోగులకు స్టాండర్డ్​ డిడక్షన్ పెంచే విధానాన్ని 2005-06 రద్దు చేయగా.. మోదీ ప్రభుత్వం దానిని తిరిగి 2018-19 ఆర్థిక సంవత్సరంలో పునర్​ప్రవేశపెట్టింది.

స్టాండర్డ్​  డిడక్షన్​ ప్రస్తుతం రూ.50 వేలుగా ఉంది. రూ.లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది.

దీనితో పాటు వర్క్​ ఫ్రం హోంకు పన్ను లేని అలవెన్సులు ఇవ్వాలని కూడా సామాన్యులు కోరుతున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలు

సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్​ఎంఈ) విభాగాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలు కూడా బడ్జెట్​పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

కరోనా కాలంలో చిన్న పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయిన కారణంగా.. ప్రభుత్వం నుంచి అదనపు సబ్సిడీలు, వడ్డీ రహిత రుణాల వంటివి కోరుకుంటున్నారు.

ఆదాయపు పన్ను పరిమితి పెంపు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలుగా ఉన్న ఇన్​కం ట్యాక్స్​ పరిధిలోకి వచ్చే ఆదాయపు పరిమితిని పెంచాలని కూడా అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. 

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను వర్తించే.. వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

క్రిప్టో కరెన్సీ..

బిట్​కాయిన్ గత ఏడాది రికార్డు సృష్టించింది. ఒక కాయిన్ విలువ 65 వేల డాలర్లు దాటింది. అయితే ప్రభుత్వం ఇప్పటికే బిట్​కాయిన్​ను నిషేధించబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

వాటిని ఆస్తులుగా పరిగణిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది.. దానిని కరెన్సీగా గుర్తించే వీలు లేదని తెలిపింది.

మరి ఈ బడ్జెట్​లో క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ వైఖరి స్పష్టమయ్యే అవకాశాలున్నాయి.

ఇక వీటితో పాటు కరోనా, చిప్​ల కొరత సహా వివిధ కారణాలతో సంక్షోభం ఎదుర్కొన్న రంగాలకు కేంద్రం ఊరటనివ్వాలని డిమాండ్​ వినిపిస్తోంది. ఈ అంశాలన్నింటిపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో బడ్జెట్​ ద్వారా స్పష్టం కానుంది.

Also read: Budget 2022: త్వరలో తగ్గనున్న స్మార్ట్​ఫోన్స్​, ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు?

Also read: Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022 కోసం ప్రత్యేక యాప్​.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News