Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold and Silver Prices on 14 December 2022 In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,330గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 14, 2022, 06:39 AM IST
  • బంగారం ప్రియులకు ఊరట
  • స్థిరంగా బంగారం ధర
  • తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate and Silver Price stable on 14th December 2022: గత కొన్ని రోజలుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. నెల రోజుల్లో తులం బంగారంపై దాదాపుగా రూ. 3000 మేర పెరిగింది. అయితే పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం  (డిసెంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,800లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,330లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,490గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,330గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,400గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,980 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,850గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,390గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,330గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,330గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800.. 24 క్యారెట్ల ధర రూ. 54,330గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,330 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. బుధవారం (డిసెంబర్ 14) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 69,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 69,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 73,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 73,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 73,000ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: Who is Rohit Sharma's wife: రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఎవరో తెలుసా ?

Also Read: Pranitha Subhash: పవన్ కళ్యాణ్ డైలాగ్స్‌తో ప్రణీత రచ్చ.. ట్రెండీ వేర్‌లో మతిపొగోడుతున్న పోజులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News