EPFO Interest Rate: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన వడ్డీ..!

EPF Interest Rate Fixed at 8.15% for FY 2022-23: వడ్డీ రేట్లను పెంచుతూ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 11:51 AM IST
EPFO Interest Rate: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన వడ్డీ..!

EPF Interest Rate Fixed at 8.15% for FY 2022-23: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కోట్లాది ఖాతాదారులకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌)పై వడ్డీని పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ ఖాతాదారులకు 8.15 శాతం వడ్డీ రేటు ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. దేశంలోని 6 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్‌ ఖాతాదారులకు వడ్డీ పెరిగింది.  2021-22కి పీఎఫ్‌ ​​వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించగా.. ఇది గత నాలుగు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.5 శాతంగా ఉంది. ఈ ఏడాది కూడా వడ్డీ రేటు తగ్గుతుందని నిపుణులు అంచనా వేయగా.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. 8.15 శాతానికి ఈపీఎఫ్‌ఓ పెంచింది.

ఈపీఎఫ్‌ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ రేటును ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేట్లను నిర్ణయించిన వెంటనే.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఫైల్‌ను పంపించింది. ఈ వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ.. ఆర్థికశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేట్లను కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించే అవకాశం ఉంది.

పీఎఫ్ అకౌంట్‌లో నిల్వ ఉన్న నగదుపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి  8.15 శాతం వడ్డీ జమకానుంది. గతేడాది  8.10 శాతం ఉండగా.. ఈ ఏడాది మరో  0.05 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

గతేడాది అమలు చేసిన వడ్డీ రేటు (8.10 శాతం) 43 సంవత్సరాలలో ఇదే అతి తక్కువ. 1977-78 మధ్య కాలంలో 8 శాతం వడ్డీ రేటు అమలు చేసింది. 2015-16లో ఈపీఎఫ్‌ చందాదారులకు వడ్డీరేటు 8.8 శాతంగా ఉంది. 2016-17లో 8.65 శాతం వడ్డీని ఆఫర్ చేసింది. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2020-21లో ఈ రేటు 8.50 శాతంగా ఉండేది. మొత్తంగా గత ఏడేళ్ల వ్యవధిలో పీఎఫ్ వడ్డీ రేటు 0.65 శాతం వరకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరానికి పెంచినా.. స్వల్ప మొత్తంలోనే పెంచింది. ఈపీఎఫ్‌ఓ ​​దాదాపు 6 కోట్ల మంది సభ్యులను కలిగి ఉంది.

Also Read: CAG Report: కాగ్ సంచలన రిపోర్ట్.. అడగకుండానే ఈ బ్యాంక్‌కు రూ.8,800 కోట్లు ..!  

Also Read: IPL 2023: రూమ్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సూర్యకుమార్ యాదవ్.. బాలీవుడ్ డైలాగ్స్‌తో సెట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News