సైకిల్ గుర్తుకు ఓటేయ్యాలని కోరిన టీఆర్ఎస్ నేత !!

సైకిల్ గుర్తుకు ఓటేయాలనని టీఆర్ఎస్ నేత కోరడం ఏంటిని ఆశ్చర్యమేస్తుంది కదూ.. నమ్మలేకపోతున్నారా అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది. 

Last Updated : Apr 10, 2019, 04:37 PM IST
సైకిల్ గుర్తుకు ఓటేయ్యాలని కోరిన టీఆర్ఎస్ నేత !!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యేగా ఎన్నికైన సండ్ర వెంకటవీరయ్య రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్ సభ  ఎన్నికల్లో భాగంగా ఆయన ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఈ క్రమంలో సండ్ర నోరు జారీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సండ్ర..కారుగుర్తుకే ఓటు వేయాలని కోరాల్సింది..అలవాటులో పొరపాటుగా  సైకిల్ గుర్తుకే ఓటువేయాలని ఓటర్లను కోరారడం కార్యకర్తలకు ఆశ్చరయానికి గురిచేసింది.  తన పొరపాటను గుర్తించిన ఆయన వెంటనే సరిదిద్దుకున్నారట. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  సండ్ర  వ్యాఖ్యలు  సోషల్ మీడియాకు పాకాయి. మరి ఓటర్లు ఏ గుర్తుకు ఓటు వేస్తారో మరి వేచిచూడాల్సిందే.

Trending News