పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్‌

వైస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ వద్ద షిర్డి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో రైలులోని ప్రయాణికులంతా ఏం జరిగిందో ఏమోనని ఉలిక్కి పడ్డారు.

Last Updated : Dec 3, 2019, 06:35 PM IST
పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్‌

కడప: షిర్డి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. వైస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ వద్ద షిర్డి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో రైలులోని ప్రయాణికులంతా ఏం జరిగిందో ఏమోనని ఉలిక్కి పడ్డారు. షిర్డీ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి షిర్డి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వికలాంగుల బోగి పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. అయితే, అదృష్టవశాత్తుగా ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Trending News