అంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన సారధిగా శైలజ నాథ్

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ రఘువీరారెడ్డి పీసిసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుండి ఈ పదవి ఇప్పటివరకు ఖాళీగా ఉంది. 

Last Updated : Jan 16, 2020, 07:03 PM IST
అంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన సారధిగా శైలజ నాథ్

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ రఘువీరారెడ్డి పీసిసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుండి ఈ పదవి ఇప్పటివరకు ఖాళీగా ఉంది. 

కాగా, గురువారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సాకే శైలజానాథ్‌కు ఎపీసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయనతోపాటు కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్ తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని కాంగ్రెస్ నియమించింది. పార్టీకి విశేష సేవలందించిన మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రశంసించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News