ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌కి ఏర్పాట్లు పూర్తి

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌కి సర్వం సిద్ధం!

Last Updated : May 5, 2019, 08:21 PM IST
ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌కి ఏర్పాట్లు పూర్తి

అమ‌రావ‌తి: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా రేపు దేశంలోని పలు ప్రాంతాల్లో 5వ విడత పోలింగ్ జరగనుండగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మూడు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నామని, పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని ద్వివేది మీడియాకు తెలిపారు. 

నరసరావుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని 94వ పోలింగ్ కేంద్రంలో, గుంటూరు పశ్చిమ స్థానం పరిధిలోని 244వ పోలింగ్ కేంద్రంలో, యర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం పరిధిలోని 247వ పోలింగ్ కేంద్రంలో, కోవూరు అసెంబ్లీ స్థానం పరిధిలోని 41వ పోలింగ్ కేంద్రంలో, సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని అటకానితిప్పలోని 197వ పోలింగ్ కేంద్రంలో సోమవారం రీపోలింగ్ జరగనున్నట్టు ద్వివేది వెల్లడించారు.

Trending News