అదే అసలైన విషాదం; విమర్శించేందుకు ఇక్కడికి రాలేదు

బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించి కొందరు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని పరోక్షంగా ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.

Last Updated : Dec 9, 2017, 07:04 PM IST
అదే అసలైన విషాదం; విమర్శించేందుకు ఇక్కడికి రాలేదు

బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించి కొందరు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని పరోక్షంగా ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. శనివారం 'చలోరే చలోరే చల్' పర్యటనలో భాగంగా ఒంగోలు ఎన్ఠీఆర్ కళాక్షేత్రంలో ఆయన ప్రసంగించారు. బోటు ప్రమాద బాధితులతో మాట్లాడారు. నేను అధికారులను, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇక్కడికి రాలేదన్నారు. 

"ఎక్స్ గ్రేషియాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. ప్రభుత్వం వారికి అండగా నిలవాలి. రాజకీయ నాయకులకు సున్నితమైన మనస్తత్వం లేకుండా పోయింది. ప్రమాదానికి కారకులైన వారు తప్పించుకొని తిరగడం అసలైన విషాదం. వారిని వెంటనే శిక్షించాలి. ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి" అని ఉద్వేగభరితంగా మాట్లాడారు.

Trending News