జనసేన పార్టీకి భారీ విరాళం అందించిన నితిన్

జనసేన పార్టీకి భారీ విరాళం అందించిన నితిన్

Last Updated : Apr 9, 2019, 12:49 AM IST
జనసేన పార్టీకి భారీ విరాళం అందించిన నితిన్

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కల్యాణ్‌కి వీరాభిమాని అయిన నితిన్ సోమవారం ఆ పార్టీ నిధికి రూ.25 లక్షల విరాళం అందించారు. నితిన్ తండ్రి, నిర్మాత నల్ల సుధాకర్ రెడ్డి సోమవారం రాత్రి భీమవరంలో జనసేనాని పవన్ కల్యాణ్‌ని కలిసి నితిన్ తరపున ఈ చెక్ అందించారు. డీ హైడ్రేషన్‌ కారణంగా రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. '' సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేయడం తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని అన్నారు. అంతేకాకుండా తనపై, తన పార్టీపై ఎంతో అభిమానంతో జనసేనకు విరాళం పంపించినందుకు నితిన్‌కు, సుధాకర్‌ రెడ్డిగారికి కృతజ్ఞతలు చెబుతున్నానని పవన్ ప్రకటించారు.

Trending News