E Buses: APSRTC E Busకు మార్గం సుగమమే, త్వరలో ప్రారంభం

E Buses: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీఎస్సార్టీసీ త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 250 ఇ బస్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. తొలిదశలో ఎంపిక చేసిన నగరాల్లో ఇ బస్సులు తిరగనున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2021, 11:23 AM IST
  • ఏపీఎస్సార్టీసీలో త్వరలో 250 ఇ బస్సులు
  • తిరుమల-తిరుపతి సర్వీసుల కోసం త్వరలో 100 ఇ బస్సులు
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆర్టీసీ నిర్ణయం
E Buses: APSRTC E Busకు మార్గం సుగమమే, త్వరలో ప్రారంభం

E Buses: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీఎస్సార్టీసీ త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 250 ఇ బస్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. తొలిదశలో ఎంపిక చేసిన నగరాల్లో ఇ బస్సులు తిరగనున్నాయి.

ఇంధన ధరలు(Fuel Prices)ఆకాశాన్నంటుతుండటం, భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ రవాణాపై ఆధారపడే పరిస్థితి ఉండటం కారణంగా ఏపీఎస్సార్టీసీ(APSRTC)సైతం అదే దిశగా పయనిస్తోంది. ఆర్టీసీలో తొలిసారిగా 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే మార్గం సుగమమైంది. తిరుమల, తిరుపతిలో ఈ వంద ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేందుకు వీలుగా టెండర్ ప్రక్రియ పూర్తయింది. రాయితీ అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ప్రాంతాల్లో మొత్తంత 250 ఇ బస్సుల్ని అద్దె విధానంలో ప్రవేశపెట్టాలని ఆర్ఠీసీ నిర్ణయించింది. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని విధి విధానాన్ని ఖరారు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)ఆదేశాల మేరకు ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అద్దె బస్సుల రేట్లకు మించకుండా ఇ బస్సుల టెండర్లు ఉండాలి. అయితే విజయవాడ, కాకినాడలలో సర్వీసులకు పలు సంస్థలు డీజిల్ బస్సు ధరల కంటే ఎక్కువకు కోట్ చేశాయి. ఫలితంగా ఇ బస్సు సర్వీసుల అంశం వాయిదా పడింది. తిరుమల, తిరుపతిలలో సర్వీసులకు కూడా అశోక్ లైలాండ్, ఈవే ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కాస్త ఎక్కువకు కోట్ చేయడంతో ఆర్టీసీ ఆ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. చివరకు డీజిల్ బస్సుల ధరలకు ఎల్ 1గా నిలిచి ఈవే ట్రాన్స్ లిమిటెడ్‌కు తిరుమల-తిరుపతి 100 బస్సుల్ని ఖరారు చేసింది. తిరుమల, తిరుపతి ఇ బస్సు సర్వీసుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ప్రారంభించనున్నారు. వంద ఇ బస్సుల్లో తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో 50, తిరుపతి నుంచి కడప, నెల్లూరు, మదనపల్లి, రేణిగుంటలకు మరో 50 బస్సులు తిరగనున్నాయి. రెండవ దశలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఇ బస్సుల్ని(E Buses) ప్రవేశపెట్టనున్నారు. 

Also read: Diwali Special Trains: దీపావళికు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News