పవనిజంపై కత్తి మహేష్ సరికొత్త అస్త్రాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

Last Updated : Mar 13, 2018, 04:39 PM IST
 పవనిజంపై కత్తి మహేష్ సరికొత్త అస్త్రాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా జనసేన, పవనిజంపై కత్తి మండిపడ్డారు. జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉందంటూ కత్తి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి నెలకొందని కత్తి చెప్పుకొచ్చారు. ఓ వైపు పవన్ కల్యాణ్‌‌ను విమర్శిస్తూనే చివరి ట్వీట్‌‌లో ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం కొసమెరుపు

కత్తి ట్వీట్స్ ఇలా..

- "జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజురి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం"

 

-" పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ల్యాండ్ డీల్ నాకు ఇస్తే, పవన్ కళ్యాణ్ పక్కన ప్లాట్ తీసుకుని అమరావతి షిఫ్ట్ అవ్వడానికి నేను రెడీ!"

 

-"మాదాసు గంగాధరం మరియు రాఘవయ్య లాంటి యువనాయకత్వం జనసేన ఆవిర్భావసభ ఏర్పాట్లు చూసుకోవడం ముదావహం. పవన్ కళ్యాణ్ కి అభినందనలు"

 

Trending News