కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లాలో దారుణం జరిగింది.   రోడ్డు ప్రమాదం.. కారణంగా ఓ ఆర్టీసీ బస్సు పూర్తిగా  కాలిపోయింది.  కడప జిల్లా  రైల్వే కోడూరు మండలంలో ఈ ఘటన జరిగింది. శెట్టిగుంట లక్ష్మి గారి పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. 

Last Updated : Feb 11, 2020, 12:11 PM IST
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లాలో దారుణం జరిగింది.   రోడ్డు ప్రమాదం.. కారణంగా ఓ ఆర్టీసీ బస్సు పూర్తిగా  కాలిపోయింది.  కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఈ ఘటన జరిగింది. శెట్టిగుంట లక్ష్మి గారి పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. కడప నుంచి తిరుపతి వెళ్తున్న non-stop ఆర్టీసీ బస్సును ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో స్కూటరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు స్కూటర్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోవడంతో ఒక్కసారిగా బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సు కింద ఉన్న స్కూటర్ కు చెలరేగిన మంటలు .. క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. ఇంతలోనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ . .  ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  కానీ  ప్రమాదంలో  బస్సు పూర్తి గా దగ్ధమైంది.

ప్రయాణీకులు ఇచ్చిన సమాచారంలో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది .. మంటలను ఆర్పివేశారు. కానీ బస్సు చివరి సీట్లో కూర్చున్న వ్యక్తికి మంటలు అంటుకుని మృతి చెందారు. ఆ సీట్లో ఉన్న వ్యక్తి మృతదేహం మాంసపు ముద్దలా తయారైంది. కనీసం ఆడ, మగ కూడా గుర్తు పట్టలేని విధంగా పరిస్థితి ఉంది. 

Trending News