చంద్రబాబు కంటే ఊసరవెల్లి బెటర్: బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కంటే ఊసరవెల్లి నయమని.. ఊసరవెల్లులు కూడా సిగ్గుపడే రాజకీయాలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు కురిపించారు.

Last Updated : Nov 3, 2018, 12:11 PM IST
చంద్రబాబు కంటే ఊసరవెల్లి బెటర్: బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కంటే ఊసరవెల్లి నయమని.. ఊసరవెల్లులు కూడా సిగ్గుపడే రాజకీయాలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు కురిపించారు. చంద్రబాబు కేవలం అధికార దాహంతోనే పాలన సాగిస్తున్నారని.. మోదీని నిందించే అధికారం ఆయనకు లేదని కన్నా అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారో అందరికీ తెలుసని.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీకి అధినేతగా ఉన్న చంద్రబాబు, కాంగ్రెస్ నేతలతో కలిసి పార్టీని భ్రష్టుపట్టించారన్నారు.

ఒకనాడు భారత ప్రధాని నరేంద్ర మోదీని దేవుడితో పోల్చిన చంద్రబాబే నేడు మళ్లీ ఆయనపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కన్నా తెలిపారు. అలాగే కాంగ్రెస్ నేతలను చంద్రబాబు తిట్టలేదని అనుకోవద్దని.. గతంలో ఆయన సోనియా గాంధీని కూడా తిట్టారని.. ఇప్పుడు మళ్లీ ఆమె పార్టీతోనే జత కలవడానికి ఆశ పడుతున్నారని ఎద్దేవా చేశారు. యూటర్న్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు బాగా పరిణితి చెందుతున్నారని కన్నా అన్నారు.

తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని దిగజార్చడం కోసం చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారని కన్నా అన్నారు. చంద్రబాబుపై బీజేపీ అధికార ప్రతినిధి చాగర్లమూడి గాయత్రి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి అంత్యక్రియలు చేసిన ఘనత చంద్రబాబుకి మాత్రమే దక్కుతుందని తెలిపారు. యూపీఐ పాలనలో సాగిన కుంభకోణాలు అన్నీ ఇన్నీకావని.. అలాంటి పార్టీతో చంద్రబాబు జతకట్టి.. విదేశీ కంపెనీలకు రాష్ట్రాన్ని కట్టబెట్టిన చంద్రబాబు ఏం ప్రగతిని  సాధిస్తారని తెలిపారు. చంద్రబాబు మానసిక పరిస్థితిని గురించి నేతలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.

Trending News