ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్.. నవంబర్ 17న పరీక్ష

ఏపీపీ పోస్టుల నోటిఫికేషన్.. నవంబర్ 17న పరీక్ష

Last Updated : Oct 1, 2019, 02:41 PM IST
ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్.. నవంబర్ 17న పరీక్ష

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా వున్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తూ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యలో పట్టభద్రులైన ఏపీకి చెందిన అభ్యర్థులు మాత్రమే సెప్టెంబరు 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటనలో పేర్కొంది. నోటిఫికేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం నవంబరు 17న రాతపరీక్ష ఉంటుంది.

Trending News