ఏపీలో మరో కరోనా మరణం.. 2051కి చేరిన కేసులు

#APFightsCorona | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో తాజాగా 33 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : May 12, 2020, 01:43 PM IST
ఏపీలో మరో కరోనా మరణం.. 2051కి చేరిన కేసులు

#APFightsCorona | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో తాజాగా 33 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,051కి చేరింది. నిన్న ఒక్కరోజు 10,730 శాంపిల్స్ సేకరించి పరీక్షించగా 33 మంది పాజిటివ్‌గా తేలింది. కరోనా ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 58 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1056కి చేరింది. ఏపీలో ఇప్పటివరకూ కోవిడ్ బారిన పడి 46 మంది చనిపోయారు. తాజాగా ఓ మరణం సంభవించింది. నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

Image Credit: twitter/@ArogyaAndhra

తాజాగా నమోదైన 33 కేసులో 20 కేసులు తమిళనాడు వచ్చిన వారి నుంచి నమోదయ్యాయి. చిత్తూరులో 10, నెల్లూరులో 9, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కో పాజిటివ్ కేసులు రాగా, వీరంతా ఇటీవల తమిళనాడు నుంచి తిరిగొచ్చిన వారు కావడం గమనార్హం. తాజాగా సంభవించిన మరణంతో కలిసి కృష్ణా జిల్లాలో కరోనా మరణాలు 14కి చేరుకున్నాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 16 మంది కరోనా కాటుకు బలయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News