Congress Party: కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

 Congress Party: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలను పిలుపునిచ్చింది. ఆ రోజు పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లి.. అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 05:32 PM IST

 Congress Party: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలను పిలుపునిచ్చింది. ఆ రోజు పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లి.. అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించే కాంగ్రెస్‌ నేతలు ముందుగా పార్లమెంట్‌ వద్దకు చేరుకొని రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలపనున్నారు. అక్కడి నుంచి ప్రధాని నివాసాన్ని ముట్టడించనున్నారు. రాష్ట్రాల్లో గవర్నర్ల ఇంటి వద్ద వద్ద కూడా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేయనున్నాయి.

 

Video ThumbnailPlay icon

Trending News