KTR ON ITIR:ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు సిగ్గుచేటు.. తెలంగాణపై మోడీ సర్కార్ కక్ష కట్టిందన్న కేటీఆర్

KTR ON ITIR:ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామంటూ పార్లమెంట్‌లో  కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటు అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు చేశారని విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి కేంద్రం దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

Written by - Srisailam | Last Updated : Jul 29, 2022, 02:20 PM IST
  • ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు సిగ్గుచేటు- కేటీఆర్
  • తెలంగాణపై మోడీ సర్కార్ వివక్ష
  • ఐటిఐఅర్‌కు సమాన ప్యాకేజీకి డిమాండ్
KTR ON ITIR:ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు సిగ్గుచేటు.. తెలంగాణపై మోడీ సర్కార్ కక్ష కట్టిందన్న కేటీఆర్

KTR ON ITIR:ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామంటూ పార్లమెంట్‌లో  కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటు అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు చేశారని విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి కేంద్రం దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారని కేటీఆర్ విమర్శించారు.  రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి మోడీ సర్కార్ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమాన స్థాయిలో హైదరాబాద్ ఐటీకి ఊతమిచ్చే ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరామన్నారు కేటీఆర్.అయినా  మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకోసిస్టమ్ కు నయా పైసా సాయం చేయలేదని అన్నారు. 

ఐటీఐఆర్ రద్దుతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టంపై కేంద్రం వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు వచ్చి ఉంటే హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టం మరింత పురోగతి సాధించేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టి హాబ్ -2  నిర్మాణాన్ని 450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం రూపాయి కూడా విదిల్చలేదన్నారు. 2008లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా.. మోడీ సర్కార్ కుట్రపూరితంగా ఆపేసిందన్నారు కేటీఆర్. మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరే హైదరాబాద్ ఐటీఐఆర్‌ను కూడా పక్కన పెట్టిందని విమర్శించారు.  కేంద్రానికి హైదరాబాద్ ఐటి పరిశ్రమ అభివ‌‌ృద్దిపైన చిత్తశుద్ది లేకనే ఐటిఐఅర్ కు ప్రత్యామ్నాయం చూపలేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్ తో  ఏర్పడిన  ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశ సగటును మించిన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందన్నారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తాము చేస్తున్న ధోఖాను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. 

ఐటి పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలను చూపి రద్దు చేయడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికున్న విధానపరమైన నిబద్దతకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేశా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ లకు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ, తెలంగాణకు వస్తున్న చారానా, ఆఠానా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమన్నారు. ఐటీఐఆర్ కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోడీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఇక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా… ప్రధాని మోడీలో చలనం రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటి రంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈమద్యనే ప్రకటించిన సాఫ్ట్ వేర్ పార్క్ లే సాక్ష్యం అన్నారు.దేశవ్యాప్తంగా 22 సాప్ట్ వేర్ పార్కులను ప్రకటిచించి తెలంగాణకు మెండిచేయి చూపడం బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమన్నారు.

ఐటిఐఅర్, సాప్ట్ వేర్ పార్కుల్లో తెలంగాణకు స్ధానం ఇవ్వని కేంద్రం, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టి హాబ్ -2  నిర్మాణాన్ని 450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదన్నారు. యువతకు  ఉపాది కల్పించే విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ముందుచూపు లేదని, యువతకు ఉపాదికల్పణ,శిక్షణ రంగాల్లో కేంద్రం విఫలం అయిన విషయాన్ని దేశంలోని యువత,నిరుద్యోగులు గమనిస్తున్నారని కెటియార్ తెలిపారు. ఇలా తెలంగాణ ఐటి రంగంతోపాటు , అన్ని అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం విధానాలను ఇక్కడి యువత గమనించాలని కోరారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటి రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటిఐఅర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్ సూచించారు. 

Also read:Musi River: మూసీ నదికి తగ్గిన వరద ప్రవాహం..ఊపిరి పీల్చుకున్న నగరవాసులు..!

Also read:Ashwini Dutt:నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన అశ్వినీదత్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News