మరో పరువు దాడి, కాల యముడిగా మారిన తండ్రి

                

Last Updated : Sep 20, 2018, 04:44 PM IST
మరో పరువు దాడి, కాల యముడిగా మారిన తండ్రి

హైదరాబాద్: ప్రణయ్ ఘటన మరువకముందేఅదే తరహా దాడి జరిగింది. ఈ సారి హైదరాబాద్ నగరం ఇందుకు వేదికగా నిలిచింది. కన్న వారిని కాదని కూతురు కులాంతర వివహం చేసుకుందని కసితో కన్నతండ్రే కాలయముడిగా మారి..కూతురు,అల్లుడిపై క్రూరంగా దాడి చేశాడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కొబ్బరిబోండాలు నరికే కత్తితో దాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్లినట్లయితే హైదరాబాద్ బోరబండకు చెందిన మాధవి (20) వారం రోజుల క్రితం ఎర్రగడ్డకు చెందిన సందీప్ (21) తో కన్నవారిని ఎదిరించి కూలంతర వివాహం చేరుకుంది. తన  కులం, పరువు ప్రతిష్టలను మంటకలిశాయనే ఉక్రోషంతో తండ్రి మనోహరచారి తన కన్న కూతుర్నే కడతేర్చే ప్రయత్నాం  చేశాడు. బుధవారం మధ్యహ్నం హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంతంలో అందరూ చూస్తుండగానే బైక్ పై ఉన్న కూతరు, అల్లుడిపై కత్తితో దాడి చేశాడు. అల్లుడు స్పల్పగాయంగా తప్పించుకోగా..కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

పోలీసుల కథన ప్రకారం.. దాడికి పాల్పడిన తర్వాత నిందితుడు మనోహరచారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కూతురు చేసిన పనికి తన పరువుపోయిందని..తన కుమార్తె మాధవిని చంపాలనే దాడి చేశానని తండ్రి మనోహరచారి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దాడి జరిగిన ఘటన  తీరు కళ్లకు కట్టినట్లు సిసి కెమెరా ఫుటేజీలతో కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రయణ్ దాడి ఘటన మరువకముందే మరో   పరువు దాడి జరగడం గమనార్హం

Trending News